భారతదేశం, ఫిబ్రవరి 18 -- మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు కోర్టు బెయిల్ ఇచ్చింది. పోలీసుల కస్టడీ పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసింది. 2023 సంక్రాంతి లక్కీ డ్రా కేసులో అంబటికి గుంటూరు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. జనవరి 31 నుంచి రాజమండ్రి సెంట్రల్‌ జైలులో అంబటి ఉన్నారు. ఒక కేసులో అంబటిపై పట్టాభిపురం పోలీసులు నమోదు చేశారు. ఈ కేసులో బెయిల్‌ మంజూరై విడుదల అవుతారని అనుకుంటున్న తరుణంలో వెంటనే మరో కేసులో పీటీ వారెంట్‌ జారీ అయ్యింది. గతంలో అంబటి నిర్వహించిన సంక్రాంతి సంబరాలపై జనసేన నాయకుడు పెట్టిన కేసులో పీటీ వారెంట్‌ జారీచేశారు. తాజాగా ఈ కేసులో అంబటికి గుంటూరు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

2023లో సత్తెనపల్లిలో సంక్రాంతి లాటరీ కేసులో అంబటి రాంబాబు బుధవారం సాయంత్రం రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ కేసుతోపాటుగా జనవరి 31న...