ఆంధ్రప్రదేశ్,అమరావతి, ఫిబ్రవరి 28 -- కూటమి ప్రభుత్వం ప్రవేెశపెట్టన బడ్జెట్ పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. తొలి బడ్జెట్ సంఖ్య ఘనం - కేటాయింపులు శూన్యం అంటూ సెటైర్లు విసిరారు. "అంతా అంకెల గారడి - అభూత కల్పన. దశ - దిశ లేని.. పస లేని బడ్జెట్ ఇది. రాష్ట్రం గుల్ల.. బడ్జెట్ అంతా డొల్ల" అంటూ దుయ్యబట్టారు.

ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా, ఎన్నికల వాగ్దానాలను పూర్తిగా విస్మరించారని వైఎస్ షర్మిల ఆక్షేపించారు. "సూపర్ సిక్స్ పథకాలకు పంగనామాలు పెట్టారు. ఇతర హామీలకు ఎగనామం పెట్టారు. ఇది మంచి ప్రభుత్వం కాదు.. ముంచే ప్రభుత్వం అని తొలి బడ్జెట్‌తోనే నిరూపితం అయ్యింది. సూపర్ సిక్స్ - సూపర్ ఫ్లాప్" అని వ్యాఖ్యానించారు.

"అన్నదాత సుఖీభవ పథకానికి కేవలం రూ.6,300 కోట్లు కేటాయించడం అరకొరనే. రాష్ట్రంలో 54 లక్షల మంది రైతులు ఎదురుచూస్తుంటే.. ర...