భారతదేశం, ఏప్రిల్ 3 -- 11 గంటల సుదీర్ఘ చర్చ అనంతరం వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్ సభ గురువారం ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకంగా 232 మంది సభ్యులు ఓటేశారు.

ఈ బిల్లు ఇప్పుడు రాజ్యసభకు వెళ్లనుంది. అక్కడ మరో సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం ఉంది. ఇందుకోసం 8 గంటల సమయం కేటాయించినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

గత ఏడాది ఆగస్టులో ప్రవేశపెట్టిన బిల్లును పరిశీలించిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ పలు సిఫారసులు చేసింది. ఈ సిఫారసులను పొందుపరిచి, ప్రభుత్వం సవరించిన బిల్లును తీసుకువచ్చింది. ముసల్మాన్ వక్ఫ్ (రద్దు) బిల్లు 2024 కూడా లోక్‌సభలో ఆమోదం పొందింది. లోక్ సభలో దాదాపు 12 గంటల పాటు చర్చ సాగింది.

బిల్లు ఆమోదం పొందిన తర్వాత ముస్లిం సమాజంలోని పేదలు ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలుపుతారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు.

బిల్లు ముస్...