భారతదేశం, ఫిబ్రవరి 1 -- రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ అరుదైన మైలురాయిని చేరుకున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, తన వస్త్రధారణతో భారతీయ చేనేత కళపై ఉన్న మక్కువను మరోసారి చాటుకున్నారు. పార్లమెంటుకు హాజరైన సమయంలో ఆమె ధరించిన ఎరుపు-మెరూన్ రంగు సిల్క్ చీర ఎంతో ఆకర్షణీయంగా, హుందాగా కనిపించింది.

ఈ పట్టుచీరపై మస్టర్డ్​ యెల్లో చెక్స్​, ముదురు గోధుమ రంగు బోర్డర్ ఉన్నాయి. సింపుల్‌గా ఉన్న ఈ చీరకు మ్యాచింగ్‌గా ఆమె పసుపు రంగు బ్లౌజ్‌ను ధరించారు. కేవలం ఫ్యాషన్ కోసమే కాకుండా, దేశీయ చేనేత రంగానికి, అట్టడుగు స్థాయి కళాకారులకు తాము అండగా ఉంటామనే బలమైన సందేశాన్ని ఈ వస్త్రధారణ ద్వారా ఆమె ఇచ్చారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ పార్లమెంట్​కు చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు బడ్జెట్​ని ప్రవేశపెట్టబోతున్నారు. అంతకుముందు, రాష్ట్ర...