భారతదేశం, మార్చి 16 -- అనధికార లేఔట్లలోని ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు లేఔట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ఎల్‌ఆర్‌ఎస్‌ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. స్కీమ్ అమలులో వేగం పెంచేందుకు 25 శాతం రాయితీని కూడా ప్రకటించింది. దీంతో అప్లికేషన్ చేసుకున్న చాలా మంది క్రమబద్ధీకరణ ఫీజులను చెల్లించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.

ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న లక్షలాది మంది వివరాలు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశారు. స్టేటస్ కూడా చేసుకునే అవకాశం ఉంది. అయితే ఆయా దరఖాస్తులకు అధికారుల నుంచి అప్రూవ్ వస్తేనే ఛార్జీల వివరాలు వెబ్ సైట్ లో డిస్ ప్లే అవుతాయి. లేకపోతే నో డేటా అని కనిపిస్తుంది. అప్రూవ్ అయిందా లేదా అనేది కూడా ఎల్ఆర్ఎస్ వెబ్ సైట్ లోనే తెలుసుకోవచ్చు. ఫీజుల చెల్లింపు, అఫ్రూవ్ చేయటంతో పాటు ఇతర విషయాల్లో ఏమైనా సందే...