తెలంగాణ,మెదక్, ఫిబ్రవరి 21 -- చాక్లెట్ కొనిస్తామని మాయమాటలు చెప్పి ఎమిదేళ్ల బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ దారుణం సంగారెడ్డి పట్టణ సమీపంలోని పసల్వాడి పరిధిలో జరిగింది. నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల కోసం బాలికను ఆస్పత్రికి తరలించారు.

వివరాల్లోకి వెళ్తే.. డబల్ బెడ్ రూమ్ కాలనీ సమీపంలో ఆడుకుంటున్న బాలికను ఇద్దరు యువకులు చూశారు. చాక్లెట్ కొనిస్తామని ఆశ చూపి వారి వెంట తీసుకెళ్లారు. దగ్గర్లోని పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేయగా. బాలికకు తీవ్ర రక్తస్రావం జరిగింది. బాలిక గట్టిగా ఏడవటంతో. చుట్టుపక్కల వాళ్లు వెళ్లి చూడగా నిందితులు పారిపోతూ కనపడ్డారు.

నిందితులను గమనించిన గ్రామస్తులు.. ఇద్దరిలో ఒకరిని పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈలోపు మరో యువకుడిని కూడా గుర్తించారు. వీరిని చితకబాదిన గ్ర...