భారతదేశం, ఫిబ్రవరి 6 -- రెపో రేట్లను యథాతథంగా ఉంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది ఆర్బీఐ (రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా). ఈ మేరకు మూడు రోజుల ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశం అనంతరం గవర్నర్​ సంజయ్​ మల్హోత్రా ఈ ప్రకటన చేశారు.

ఆర్బీఐ తాజా నిర్ణయంతో రెపో రేటు 5.25శాతం వద్ద కొనసాగుతోంది.

బడ్జెట్​ 2026 తర్వాత జరిగిన తొలి ఆర్బీఐ మానిటరీ పాలసీ సమావేశంలో వడ్డీ రేట్ల కోత ఉండదు అనే అంచనాలే మార్కెట్​లో ఉన్నాయి.

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని నష్టాల్లో ప్రారంభించిన దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. వడ్డీ రేట్లపై ఆర్బీఐ ప్రకటన తర్వాత కూడా అదే ధోరణిలో కొనసాగుతున్నాయి. ఉదయం 10 గంటల 15 నిమిషాల సమయంలో బీఎస్​ఈ సెన్సెక్స్​ 342 పాయింట్ల నష్టంతో 82,972 వద్ద ట్రేడ్​ అవుతోంది. నిఫ్టీ50.. 129 పాయింట్ల కోల్పోయి 25,515 వద్ద కొనసాగుతోంది.

Published by HT Digital Content Services...