భారతదేశం, ఫిబ్రవరి 13 -- జేఎస్‌డబ్ల్యూ మోటార్ ఇండియా తన ప్రతిష్టాత్మక ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ ఎంజీ మెజెస్టర్​ని ఆవిష్కరించింది. ప్రీమియం డీ+ సెగ్మెంట్‌లో అడుగుపెడుతున్న ఈ బ్రాండ్‌కు ఇది అత్యంత ప్రతిష్టాత్మకమైన అడుగు. ఎంజీ గ్లోస్టర్ సక్సెసర్​గా వస్తున్న ఈ మెజెస్టర్‌ను తొలిసారిగా 'ఆటో ఎక్స్‌పో 2025'లో ప్రదర్శించారు. ఇక తాజా అధికారిక లాంచ్‌తో దీని భారీ రూపం, అత్యాధునిక స్టైలింగ్‌పై పూర్తి స్పష్టత వచ్చింది.

కంపెనీ ప్రస్తుతానికి ఈ భారీ ఎస్​యూవీ ధరల వివరాలను వెల్లడించలేదు. ఏప్రిల్ 2026లో ధరలను ప్రకటించి, మే 2026 నుంచి వినియోగదారులకు డెలివరీలు ప్రారంభించాలని లక్ష్యంగా సంస్థ పెట్టుకుంది.

అయితే, భారత మార్కెట్​లో విపరీతమైన క్రేజ్ ఉన్న టయోటా ఫార్చ్యూనర్‌కు ఈ ఎంజీ మెజెస్టర్ గట్టి పోటీ ఇస్తుందని ఆటోమొబైల్​ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎంజీ...