తెలంగాణ,కరీంనగర్, మార్చి 16 -- ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నీటి సమస్య ముప్పు ముంచుకొస్తుంది. జలాశయాల్లో శరవేగంగా నీటి మట్టాలు ఘననీయంగా పడిపోతున్నాయి. ఎండవేడి వడగాడ్పులతో పంట నహపొలాలు తడారి ఎండిపోతున్నాయి. సాగు నీరు అందించి ఎండుతున్న పంటలను కాపాడాలని రైతులతోపాటు రాజకీయ పార్టీలు ఆందోళన బాట పట్టాయి. దీంతో పంటలను కాపాడేందుకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా నీటి విడుదల చేస్తున్నారు. భారీగా నీటిని కాలువల ద్వారా రైతులకు సాగునీరు అందిస్తుండడంతో జలాశయాలు ఖాళీ అవుతున్నాయి. ఈ నెలాఖరు వరకు సాగునీరు ఇవ్వాలని సర్కారు నిర్ణయించడంతో ప్రస్తుతం ఉన్న నీళ్ళు వారం పదిరోజుల్లో ఖాళీ అయ్యే పరిస్థితులు కనిపిస్తుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతుంది.

కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేర్ డ్యామ్ నీటి నిలువ సామర్థ్యం 24 టిఎంసీలు కాగా ప్రస్తుతం 9 టిఎంసి నీళ్ళు మాత్రమే ఉ...