భారతదేశం, ఫిబ్రవరి 23 -- యాపిల్​ లవర్స్​కి బిగ్​ అప్డేట్​! అంతర్జాతీయ వార్తా సంస్థల రిపోర్టుల ప్రకారం.. యాపిల్ సంస్థ వచ్చే మార్చ్​ నెల ప్రారంభంలో అనేక కొత్త పరికరాలను ఆవిష్కరించేందుకు ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు ఒక ఈవెంట్​ని కూడా నిర్వహించేందుకు రెడీ అవుతోంది. ఈ కార్యక్రమం గురించి కంపెనీ ఇంకా అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. అయినప్పటికీ, ఈ ఈవెంట్‌లో ఐఫోన్ 17ఈ, మ్యాక్, ఐప్యాడ్ వంటి ప్రాడక్ట్స్​కి సంబంధించి భారీ అప్‌డేట్స్ ఉండవచ్చని సమాచారం.

యాపిల్ "స్పెషల్ యాపిల్ ఎక్స్‌పీరియన్స్" పేరుతో కొన్ని రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించవచ్చని నివేదిక పేర్కొంది. ఈ కార్యకలాపాలు మార్చ్​ 2న ప్రారంభమై మార్చ్​ 4 వరకు కొనసాగవచ్చు. ముగింపు రోజున లండన్, న్యూయార్క్, షాంఘై వంటి నగరాల్లో ప్రత్యక్ష సెషన్లు ఉండవచ్చు. ఈ సెషన్లకు హాజరయ్యే వ్యక్తులకు, అధికారిక...