తెలంగాణ, డిసెంబర్ 6 -- CBI Notices ఢిల్లీ లిక్కర్‌ స్కాం వ్యవహారంలో టిఆర్‌ఎసస్‌ ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో మంగళవారం తాను విచారణకు హాజరు కాలేనంటూ సిబిఐకు కవిత లేఖ రాశారు. ఈ నెల 6వ తేదీన తన నివాసంలో విచారణకు హాజరవుతానంటూ కవిత మొదట్లో సిబిఐకు సమ్మతి తెలిపారు. ఆ తర్వాత ఎఫ్‌ఆర్ కాపీ కావాలని కోరడంతో సిబిఐ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందని సిబిఐ అధికారులు మెయిల్‌ ద్వారా తెలిపారు.

సిబిఐ ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు లేదని, మంగళవారం తాను అందుబాటులో ఉండనని కవిత మరో లేఖను రాశారు. ముందుగా నిర్ణయించుకున్న సమావేశాలకు హాజరు కావాల్సి ఉండటంతో వెళ్లాల్సి ఉండటంతో మరో రోజు విచారణకు హాజరవుతానని లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీ లిక్కర్‌ స్కాంపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఎక్కడా తన పేరు లేదని కల్వకుంట్ల కవిత సిబిఐకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

నిందితుల జాబిత...