తెలంగాణ,హైదరాబాద్, డిసెంబర్ 29 -- ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈ ఏడాది మార్చి నుంచి ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆగస్టు నెలలో తీహాడ్‌ జైలు నుంచి విడుదలయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత కవిత.. ఇంటికే పరిమితమయ్యారు. అయితే కొద్దిరోజులుగా కవిత మళ్లీ రాజకీయం క్షేత్రంలోకి పునరాగమనం చేశారు. జాగృతితో పాటు పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.

అధికారం కోల్పోయిన తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలతో బీఆర్ఎస్ సతమతవుతూ వస్తోంది. ఓవైపు కీలక నేతలపై కేసులు తెరపైకి వస్తున్నాయి. తాజాగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ఏసీబీ, ఈడీ కేసులు నమోదయ్యాయి. ఫార్ములా ఈరేస్ కేసలో అక్రమాలు చోటు చేసుకున్నాయని. ఇందులో కేటీఆర్ పాత్ర ఉందంటూ ఎఫ్ఐఆర్ రికార్డైంది. ఈ కేసులో దర్యాప్తు సంస్థలు. కేటీఆర్ ను ఏ1గా పేర్కొన్నాయి. ఇలా...