భారతదేశం, ఫిబ్రవరి 6 -- సుప్రీంకోర్టులో BRS ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై మరోసారి విచారణ జరిగింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మరికొంత సమయం కావాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తరపు న్యాయవాది కోరారు. ఇందుకు అంగీకరించిన న్యాయస్థానం. . స్పీకర్ కు మరో మూడు వారాల గడువు ఇచ్చింది. గడువులోగా పూర్తి చేయకపోతే స్పీకర్ పై కోర్టు ధిక్కార చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది.

పిటిషనర్ తరుపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ. ఇప్పటికే స్పీకర్ 3 సార్లు సమయం తీసుకున్నారని గుర్తు చేశారు. జనవరి 16 తర్వాత. జనవరి 30న తదుపరి విచారణ చేపట్టారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు న్యాయస్థానం స్పందిస్తూ.. "మార్చి నాటికి పూర్తవుతాయని వారు చెబుతున్నారు. 3 వారాల తర్వాత జాబితా చూస్తాం. స్పీకర్ సానుకూలంగా నిర్ణయం తీసుకుంటారని మేము ఆశిస్తున్నాము, లేకుంటే మేము కోర్టు ధిక్కార ...