భారతదేశం, ఫిబ్రవరి 15 -- మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఈనెల 16(రేపు)న రాష్ట్రానికి రానున్నారు. గేట్స్ ఫౌండేషన్ తరఫున రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులను సందర్శించడంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేశ్ తో భేటీ కానున్నారు.

ఏపీ పర్యటనలో భాగంగా బిల్ గేట్స్. సోమవారం ఉదయం 10 గంటలకు ఏపీ సచివాలయానికి చేరుకుంటారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లతో సమావేశమవుతారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, ఆరోగ్యం, వ్యవసాయం రంగాలలో ప్రభుత్వ ప్రాజెక్టులను విస్తరించడంపై చర్చలు జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి..

రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్ (ఆర్టీజీఎస్)ను బిల్ గేట్స్ పరిశీలిస్తారు. అక్క సాంకేతికత వినియోగ తీరును పరిశీలిస్తారు. రియల్‌టైం గవర్నెన్స్‌ విధా...