ఆంధ్రప్రదేశ్,గుంటూరు, మార్చి 7 -- ఆచార్య నాగార్జున యూవర్సిటీ పరిధిలో జరుగుతున్న బీఎడ్‌ పరీక్షల్లో లీకేజీ ఘటన వెలుగు చూసింది. మొదటి సెమిస్టర్‌ ప్రశ్నాపత్రం అరగంట ముందుగానే బయటికి వచ్చింది. అంతేకాదు. సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం సీరియస్ గా పరిగణిించింది. సమగ్ర విచారణకు ఆదేశించింది.

ప్రాథమిక వివరాల ప్రకారం.. ఓ కళాశాల యాజమాన్యం ప్రశ్నపత్రాన్ని లీక్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈనెల 6వ తేదీ నుంచి ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. అయితే ఇవాళ మధ్యాహ్నం జరిగే ప్రాస్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ పేపర్ అరగంటే ముందే లీక్ అయింది. ఈ విషయం కాస్త అధికారుల దృష్టికి రావటంతో. విచారణ జరుపుతున్నారు.

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బీఎడ్ పరీక్షాపత్రం లీకేజీ అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా పరిగణిస్తోందని విద్యాశాఖ మంత్రి ...