Delhi, అక్టోబర్ 2 -- బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి ఏఐబీఈ -20 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఎల్ఎల్ బీ పూర్తి చేసిన వారితో పాటు ఫైనల్ ఇయర్ చదువుతున్న అభ్యర్థులు కూడా ఈ పరీక్షను రాయవచ్చు. అర్హత ఉన్న అభ్యర్థులు allindiabarexamination.com వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.

ఏఐబీఈ ఎగ్జామ్ ఆన్ లైన్ దరఖాస్తులకు అక్టోబర్ 28వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. అక్టోబర్ 31వ తేదీ అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది. నవంబర్ 15వ తేదీన హాల్ టికెట్లను విడుదల చేస్తారు. నవంబర్ 30వ తేదీన ఈ ఎగ్జామ్ నిర్వహిస్తారు. తెలంగాణతో పాటు ఏపీలోనూ పరీక్షా కేంద్రాలుంటాయి.

ఆల్ ఇండియా బార్ ఎగ్జామినేషన్ అనేది న్యాయవాదిగా వృత్తిని ప్రారంభించాలనుకునే ల...