భారతదేశం, జూన్ 2 -- తెలంగాణ ఉద్యమం లో కీలక పాత్ర పోషించిన తొమ్మిది మందికి కోటి రూపాయల నగదు పురస్కారాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందజేశారు.

తెలంగాణ ఉద్యమంలో ప్రజల గుండెల్లో నిలిచిన కవులు కళాకారులు సాహితీవేత్తలు తొమ్మిది మందికి కోటి రూపాయల నగదు పురస్కారం అందిస్తామని తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ రోజున ముఖ్యమంత్రి ప్రకటించారు.

రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా పెరేడ్ గ్రౌండ్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి నగదు పురస్కారం అందించారు. ఈ నగదు పురస్కారాలు అందుకున్న వారిలో ఎక్కా యాదగిరి రావు, అందెశ్రీ, సుద్దాల అశోక్ తేజ, జయరాజు, పాశం యాదగిరి ఉన్నారు.

దివంగత గూడ అంజయ్య, గద్దర్, బండి యాదగిరిల తరపున వారి కుటుంబ సభ్యులు నగదు పురస్కారాన్ని అందుకున్నారు.

విదేశీ పర్యటనలో ఉన్న గోరటి వెంకన్న తరపున ఆయన కూతురు పురస్కారాన్ని అందుకున్నారు.

ఉత్తమ ప్రత...