భారతదేశం, ఫిబ్రవరి 2 -- ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను వెల్లడించారు. ఆర్టీసీ బస్సుల ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నట్టుగా చెప్పారు. ఆర్టీసీపై జనాల్లో సంతృప్తి కలిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ సంవత్సరం 2500 ఎలక్ట్రిక్/సీఎన్జీ బస్సులను కొనుగోలు చేస్తామని వెల్లడించారు.

'2026 చివరి వరకు కేంద్రం ఇచ్చే 1050 ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డు ఎక్కేలా చేస్తాం. కాలం చెల్లిన బస్సులను ఎప్పటికప్పుడు రీప్లేస్ చేస్తాం. ఆర్టీసీలో కావాల్సిన డైవర్లతోపాటుగా ఇతర నియామకాలు చేపడతాం. ఆర్టీసీ ఉద్యోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఈహెచ్ఎస్‌ను మరింత మెరుగుపరుస్తాం.' అని ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు అన్నారు.

ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆర్టీసీపై ప్రత్యేక దృష్టి ...