Hyderabad, మే 18 -- హైదరాబాద్ గుల్జార్‌ హౌస్‌ పరిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఓ భవనంలో మంటలు చెలరేగటంతో..ఈ ఘటనలో 16 మంది మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

ప్రాథమిక వివరాల ప్రకారం.ఆదివారం ఉదయం ఓ భవనంలో ప్రమాదం సంభవించింది. ఈక్రమంలోనే భవనంలో ఉన్న ఏసీ కంప్రెషర్ పేలటంతో తీవ్రత పెరిగింది. ఈ ఘోర ప్రమాదంలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. గాయపడిన వారిని దగ్గర్లోని ఆస్పత్రులకు తరలించారు.

ఈ అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. మొదట ఎనిమిది మంది చనిపోగా. ఆ తర్వాత 11కు చేరింది. ఆ కాసేపటికే 17కు చేరిపోయింది. గాయపడిన వారికి వేర్వురు ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం.

షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తు...