భారతదేశం, మే 5 -- తెలంగాణలోని చాలా ప్రాంతాలను గంజాయి పట్టిపీడిస్తోంది. పోలీసులు దాడులు చేస్తున్నా.. స్మగ్లింగ్ మాత్రం ఆగడం లేదు. ఎక్కడో ఏవోబీ నుంచి ఎవ్వరికీ చిక్కకుండా హైదరాబాద్ వరకు తీసుకొస్తున్నారు. అటు నుంచి వివిధ ప్రాంతాలకు తరలిస్తున్నారు. కేవలం ఒక్క వరంగల్ జిల్లాలో పోలీసులు 28 నెలల్లో రూ.11.58 కోట్ల విలువచేసే 45.98 క్వింటాళ్ల గంజాయి, హాష్‌ ఆయిల్, చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. 350 కేసులు నమోదు చేశారు. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఆంధ్రా, ఒడిశా సరిహద్దు సీలేరు ప్రాంతం నుంచి వరంగల్ జిల్లాకు తరలిస్తున్నారు. ఈ మార్గంలో స్మగ్లర్లకు భద్రాచలం ప్రధాన కూడలిగా ఉంటుంది. భద్రాచలం, మణుగూరు మీదుగా ములుగు జిల్లా ఏటూరునాగారం తీసుకొస్తున్నారు. అక్కడి నుంచి ములుగు, వరంగల్, భూపాలపల్లికి తరలిస్తున్నారు. ఇటు భద్రాద్రి జిల్లా దుమ్ముగూడె...