భారతదేశం, మే 27 -- 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత జరుగుతున్న తొలి మహానాడును.. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అత్యంత ఘనంగా నిర్వహించేందుకు టీడీపీ ఏర్పాట్లు చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు మహానాడుకు వచ్చారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పండగలో.. ఎప్పుడు ఏ కార్యక్రమం నిర్వహిస్తారో.. ఇప్పుడు తెలుసుకుందాం.

ఉదయం 8.30 నుంచి 10.00 గంటల వరకు ప్రతినిధుల నమోదు ఉంటుంది. 10.00 నుంచి 10.45 ఫొటో ప్రదర్శన, రక్తదాన శిబిరం ప్రారంభం అవుతుంది. 10.45 గంటలకు ప్రతినిధుల సభను పార్టీ జెండా ఆవిష్కరించి, జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభిస్తారు. మరణించిన పార్టీ కార్యకర్తలు, నాయకులకు సంతాపం తెలుపుతారు. పార్టీ ప్రధాన కార్యదర్శి నివేదిక సమర్పిస్తార. 11.30 నుంచి 11.45 గంటల మధ్య పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ ఉపాధ్యక్షుడి ప్రసం...