భారతదేశం, మే 16 -- కాళేశ్వరంలో సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి. వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు పుష్కర స్నానాలకు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. 15వ తేదీన ప్రారంభమైన పుష్కరాలు ఈ నెల 26వ తేదీ వరకు జరగనున్నాయి.

కాళేశ్వరం వెళ్లే మార్గంలో కాకతీయుల కాలంనాటి ఆలయాలు, చారిత్రక కట్టడాలు, ఆహ్లాదాన్ని పంచే పర్యాటక ప్రాంతాలు.. ఇలా దర్శనీయ ప్రదేశాలెన్నో ఉన్నాయి. మరి వీకెండ్ వచ్చేసింది.. పుష్కర స్నానం కోసం ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ తో కాళేశ్వరం వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్న వాళ్లంతా పనిలో పనిగా.. మార్గ మధ్యలోని ఓరుగల్లు అందాలనూ చూసేయండి మరి..

హైదరాబాద్, వరంగల్ వైపు నుంచి వచ్చే వాళ్లు సందర్శించేందుకు వరంగల్ నగరంలోనే కాకతీయ కాలంనాటి చారిత్రక కట్టడాలెన్నో ఉన్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వరంగల్ మీదుగా వచ్చే వాళ్లకు హనుమకొండ సిటీ మధ్యలోనే కాకతీయ రాజులు నిర్మిం...