భారతదేశం, జనవరి 30 -- హైదరాబాద్ కు చెందిన ఓ భక్తుడు.. శ్రీ పద్మావతి అమ్మవారికి బంగారు చెవి ఆభరణాలను విరాళంగా అందజేశాడు. రూ.23 లక్షల విలువైన 178 గ్రాముల బంగారంతో వీటిని తయారు చేశారు.

తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించిన వివరాల ప్రకారం.. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి హైదరాబాద్‌కు చెందిన దీపక్ 178 గ్రాముల బరువు కలిగిన బంగారు, రాళ్లతో పొదిగిన జత కర్ణపత్రములను బహుకరించారు. దాదాపు రూ. 23 లక్షల విలువైన ఈ జత కర్ణపత్రములను టీటీడీ అధికారులకు గురువారం అందజేశారు. శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానంతరం దాతకు టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....