భారతదేశం, మే 5 -- విశాఖపట్నంలోని సీతమ్మధారలో విషాదం జరిగింది. భారీ వృక్షం కూలి మహిళ మృతిచెందింది. స్కూటీ మీద వెళ్తున్న మహిళపై చెట్టు కూలడంతో అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలు పూర్ణిమ (38) గా పోలీసులు గుర్తించారు. విశాఖ ఏఎంజీ ఆస్పత్రి మార్గంలో పూర్ణిమ స్కూటీపై వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. పూర్ణిమ భర్త స్టేట్ బ్యాంక్ మేనేజర్గా పని చేస్తున్నారు. ఈ ప్రమాదంతో వాహనదారులు ఉలిక్కిపడ్డారు. ఏం జరుగుతుందో అర్థంకాక పరుగులు తీశారు.
ఇలాంటి ప్రమాదాలు జరగకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని.. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ విశ్రాంత అధికారులు సూచిస్తున్నారు. బలహీనంగా ఉన్న కొమ్మలను, ప్రమాదకరంగా ఉన్న చెట్లను గుర్తించ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.