భారతదేశం, డిసెంబర్ 5 -- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం ఉదయం ప్రకటించింది. ఫలితంగా రెపో రేటు 5.5శాతం నుంచి 5.25శాతానికి దిగొచ్చింది. ఈ మేరకు మూడు రోజుల ఆర్బీఐ మొనేటరీ పాలసీ కమిటీ సమావేశం అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు.
ఆర్బీఐ మొనేటరీ పాలసీ సమావేశం నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్గా కొనసాగుతున్నాయి. ఉదయం 10 గంటలకు నిఫ్టీ50 20 పాయింట్ల నష్టంతో 26,007 వద్ద ట్రేడ్ అవుతోంది. బ్యాంక్ నిఫ్టీ 126 పాయింట్లు పెరిగి 59,414 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్ 47 పాయింట్ల నష్టంతో 85,219 వద్ద ట్రేడ్ అవుతోంది.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.