భారతదేశం, ఫిబ్రవరి 5 -- మహారాష్ట్ర తడోబా పులుల అభయారణ్యం నుండి ఛత్తీస్‌ఘడ్‌ , తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోకి పెద్దపులి ప్రయాణించి వచ్చింది. తూర్పు గోదావరి జిల్లాలో జనావాసాలలోకి ప్రవేశించడం ఆందోళనలు కలిగిస్తుంది. రాజమండ్రి నగర శివార్లలో పులి కదలిక అటవీ అధికారులను, నివాసితులను అప్రమత్తం చేసింది. రాజమండ్రి, రాజానగరం నియోజకవర్గాల్లో సంచరిస్తున్నట్టుగా కనిపిస్తోంది.

రాజమండ్రి గ్రామీణ మండలం తొర్రేడు గ్రామంలో మొదట కనిపించడానికి ముందు ఏలూరు వైపు నుండి పెద్దపులి గోదావరి నదిని దాటినట్లుగా చెబుతారు. అది వచ్చిన వెంటనే ఆవులు, దూడపై దాడి చేసి చంపింది. తర్వాత స్థానికుల్లో భయాన్ని పెంచింది.

రాజమండ్రి, దాని పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచారం ఎక్కువగా ఉంది. సాధారణంగా ఒక పులి రోజుకు 15 నుండి 25 కిలోమీటర్ల మధ్య ప్రయాణిస్తుండగా, ఈ పెద్దపులి గత ఐదు రోజులుగ...