భారతదేశం, ఫిబ్రవరి 3 -- భారత్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​ మార్కెట్​లోకి మరో మోడల్​ అడుగుపెట్టింది. ఈసీ-06 పేరుతో యమహా సంస్థ కొత్త ఈ-స్కూటర్​ని లాంచ్​ చేసింది. దీని ప్రారంభ ఎక్స్​షోరూం ధర రూ. 1.68లక్షలుగా ఉంది. ఇది భారత్‌లో యమహా నుంచి వస్తున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనం కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఈ మోడల్​కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

యమహా ఈసీ-06 ఎలక్ట్రిక్​ స్కూటర్.. బెంగళూరుకు చెందిన స్టార్టప్ కంపెనీ రివర్ రూపొందించిన 'ఇండీ' మోడల్‌పై ఆధారపడి ఉంటుంది. రివర్ సంస్థతో కలిసి యమహా తన సొంత వెర్షన్ స్కూటర్‌ను అభివృద్ధి చేస్తోందని గతేడాది అనేక వార్తలు వెలువడ్డాయి. దానికి అనుగుణంగానే యమహా 2025 చివరిలో ఈ ఈసీ-06ని ప్రదర్శించింది.

ఈ యమహా ఈసీ-06 ఈ- స్కూటర్‌లో రివర్ ఇండీలోని 4 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్‌నే ఉపయోగించారు. దీని మోటార్ 6.7...