భారతదేశం, ఫిబ్రవరి 4 -- రంగారెడ్డి జిల్లాలోని మొయినాబాద్‌లో ఆస్తి వివాదంలో 34 ఏళ్ల మహిళా న్యాయవాదిని ఆమె సోదరుడు హత్య చేశాడు. ఈ హత్యపై న్యాయవాదులు నిరసన తెలిపారు. వెంటనే నిందితుడిని అరెస్టు చేసి న్యాయం కోసం డిమాండ్ చేస్తూ రహదారిని దిగ్బంధించారు.

కుటుంబ ఆస్తి వివాదంలో మహిళా న్యాయవాదిని ఆమె సొంత సోదరుడు హత్య చేశాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. బాధితురాలు స్వప్నగా గుర్తించారు. ఆమె చేవెళ్ల కోర్టులో ప్రాక్టీస్ చేసే న్యాయవాది. పోలీసుల దర్యాప్తు ప్రకారం, ఈ సంఘటన మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేతిరెడ్డిపల్లి గ్రామంలో జరిగింది. కుటుంబంలో చాలా కాలంగా ఉన్న ఆస్తి వివాదాన్ని పరిష్కరించడానికి పంచాయితీ జరుగుతున్న వ్యవసాయ భూమికి స్వప్న వెళ్లింది.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. స్వప్నతో సోదరుడి చర్చ తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. ఆ సమయంలో స్...