భారతదేశం, ఫిబ్రవరి 5 -- మున్సిపల్ ఎన్నికల్లో 2,996 వార్డులు, డివిజన్‌ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్న నేపథ్యంలో ఇందులో 14 స్థానాలు ఏకగ్రీవం అయినట్టుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందులో 12 మంద్రి కాంగ్రెస్ అభ్యర్థులు, ఇద్దరు బీఆర్ఎస్ అభ్యర్థులు ఉన్నారు. ఈ నెల 11వ పోలింగ్ 2,982 స్థానాలకు జరగనుంది.

అన్ని పార్టీలు, స్వతంత్రులు కలిపి 12,944 మంది పోటీలో ఉన్నారు. ప్రధాన పార్టీల నుంచి చూసుకుంటే.. కాంగ్రెస్‌ తరఫున 2,948, బీజేపీ 2,634, బీఆర్‌ఎస్‌ నుంచి 2,878 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అనేక ఇతర రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీ పడుతుండటం ఎన్నికలపై ఆసక్తిని పెంచింది.

ఇక ఆప్ నుంచి 98, బీఎస్పీ 213, సీపీఎం 128, ఎంఐఎం 282, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ 298, సీపీఐ 169, ఐయూఎంఎల్‌ 9, జేఎస్పీ 332, ఇతర పార్టీల నుంచి 240 మంది, స్వతంత్ర అభ్యర...