భారతదేశం, ఫిబ్రవరి 2 -- మహాశివరాత్రి దగ్గరకు వస్తోంది. దీంతో శైవక్షేత్రాలకు పెద్ద ఎత్తున ఏపీఎస్ఆర్టీసీ బస్సులను ప్లాన్ చేస్తోంది. ఫిబ్రవరి 15వ తేదీన మహాశివరాత్రి. ఈ సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ పలు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనుంది. ఫిబ్రవరి 14, 15వ తేదీల్లో గుంటూరు 1, 2 డిపోలతోపాటుగా పొన్నూరు, తెనాలి, మంగళగిరి డిపోల నుంచి కోటప్పకొండకు వంద ప్రత్యేక బస్సులు నడవనున్నాయి. ఫిబ్రవరి 14, 15వ తేదీల్లో కోటప్పకొండకు వెళ్తాయి. ఫిబ్రవరి 16వ తేదీన డిపోలకు చేరుకుంటాయి. క్వారీ, గోవాడ, అమరావతి, శ్రీశైలం క్షేత్రాలకు కూడా ప్రత్యేక సర్వీసులు నడుపుతామని అధికారులు చెప్పారు.

గుంటూరు-2, తెనాలి డిపోల నుంచి క్వారీ ప్రాంతానికి 50 బస్సులు నడుస్తాయి. పొన్నూరు, తెనాలి డిపోల నుంచి 45 బస్సులు గోవాడకు నడపనున్నారు ఆర్టీసీ అధికారులు. అమరావతికి గుంటూరు 1 డిపో ...