భారతదేశం, ఫిబ్రవరి 3 -- పోలవరం బ్యాక్ వాటర్ కారణంగా వర్షాకాలంలో గోదావరిలో నీరు స్వేచ్ఛగా ప్రవహించదని, భద్రాచలం ఆలయం, పట్టణం ముంపునకు దారితీస్తుందని తెలంగాణ ఎప్పటినుంచో ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సుదీర్ఘ నిరసనలు, పదే పదే చేసిన అభ్యర్థనల తర్వాత పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ కింద భద్రాచలం మునిగిపోయే అవకాశాన్ని అధ్యయనం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు చర్యలు ప్రారంభించినట్టుగా తెలుస్తోంది.

పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్‌ను 150 అడుగుల స్థాయిలో నిల్వ చేస్తే వాటి ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) నిర్ణయించినట్టు సమాచారం. భద్రాచలం దగ్గర వరదల గురించి అధ్యయనం చేయడానికి ప్రతిపాదిత కమిటీకి సభ్యుడిని నామినేట్ చేయాలని పీపీఏ తెలంగాణ అధికారులకు లేఖ రాసింది.

పోలవరం...