భారతదేశం, ఫిబ్రవరి 4 -- మొబైల్ ఫోన్‌లో తన నంబర్‌ను బ్లాక్ చేశాడన్న కోపంతో ఓ యువతి తన ప్రియుడిని కత్తితో పొడిచి చంపిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో కలకలం రేపింది. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ దారుణ ఘటనతో అందరు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 25 ఏళ్ల కామ్తా ప్రసాద్ సూర్యవంశీ బిలాస్‌పూర్‌లో ఒక అద్దె ఇంటిలో నివసిస్తూ స్థానిక హోటల్‌లో పనిచేస్తున్నాడు. సుమారు ఆరు నెలల క్రితం అతడికి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా 22 ఏళ్ల రోష్ని సూర్యవంశీ అనే మహిళ పరిచయమైంది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి ఇద్దరూ రిలేషన్‌షిప్‌లోకి వెళ్లారు.

అయితే, గత రెండు మూడు రోజులుగా వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో కామ్తా ప్రసాద్ ఆమెతో మాట్లాడటం మానేశాడు. ఆమె ఫోన్ నంబర్‌ని, ఆమె మెసేజెస్​ని బ్లాక్ చేశాడు.

బాయ్​ఫ్రెండ్​ తనని బ్లాక్ చేయడంతో ర...