భారతదేశం, ఫిబ్రవరి 4 -- మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఫిబ్రవరి 16న అమరావతిని సందర్శించి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసే అవకాశం ఉంది. మెుదట ఈ పర్యటన 18వ తేదీన ఉంటుందని భావించారు. కానీ ముందుగానే వస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై వీరిద్దరు చర్చించనున్నారని సమాచారం. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, విద్యలో మెరుగైన ఫలితాలను సాధించడానికి ఏఐ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడానికి రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది మార్చిలో బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్‌తో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది.

హెల్త్‌కేర్ అనలిటిక్స్, డిజిటల్ అగ్రికల్చర్, గవర్నెన్స్‌లో టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా ప్రజలకు వేగంగా సేవలను అందించడానికి ఈ ఎంఓయూపై సంతకం చేశారు. ఈ ప్రాజెక్టు అమలుపై చంద్రబాబు, బిల్ గేట్స్ మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. ...