భారతదేశం, నవంబర్ 10 -- ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ ఇకలేరు. ఆదివారం రాత్రిపూట హైదరాబాద్‌ నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో అందెశ్రీ మరణించారు. తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ కీలక పాత్ర. అందెశ్రీ రాసిన జయ జయహే తెలంగాణను ప్రభుత్వ రాష్ట్ర గీతంగా గుర్తించింది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....