భారతదేశం, మే 1 -- మీరు ఎప్పుడైనా వెయిటింగ్ లిస్ట్ టికెట్ మీద ఆధారపడి ప్రయాణం చేస్తున్నారా? మీ ప్రయాణ ప్రణాళికలను ప్రభావితం చేసే ఒక పెద్ద మార్పును భారతీయ రైల్వే అమలు చేస్తోంది. వెయిటింగ్ లిస్ట్ టికెట్లు ఉన్న ప్రయాణికులు ఇప్పటికే రైలు ఎక్కినప్పటికీ స్లీపర్, ఏసీ బోగీల్లోకి అనుమతించరు. రిజర్వేషన్లు కన్ఫర్మ్ చేసుకున్న వారికి సాఫీగా ప్రయాణం జరిగేలా ఈ కొత్త పాలసీని రూపొందించినప్పటికీ దీనిపై భిన్న అభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంది.

కొన్నేళ్లుగా చాలా మంది ప్రయాణికులు వెయిటింగ్ లిస్ట్ టికెట్లతో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఖాళీగా ఉన్న బెర్త్‌ను చూడటం లేదా తోటి ప్రయాణికుడిని వారి స్థలాన్ని షేర్ చేసుకోవాలని ఒప్పించడం చేస్తుంటారు. కానీ కొత్తగా అమలు చేసే నిబంధనతో ఇవేమీ కుదరవు. కన్ఫామ్ అయిన సీటు లేకుండా, రిజర్వ్డ్ కోచ్‌లలోకి మిమ్మల్ని అనుమతించరు. ...