భారతదేశం, మే 1 -- గురువారం (మే 1, 2025) దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు. కార్మిక దినోత్సవం సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో బ్యాంకులు పనిచేయవు. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ), బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ) అధికారిక సెలవుల జాబితా ప్రకారం గురువారం ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్, కరెన్సీ డెరివేటివ్స్, సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ లోన్ (ఎస్ఎల్బీ) విభాగాల్లో ట్రేడింగ్ కార్యకలాపాలు ఉండవు.

మహారాష్ట్ర దినోత్సవం కారణంగా మే 1న స్టాక్ మార్కెట్లకు సెలవు ఉంటుంది. అధికారిక వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలు, పరేడ్లు ఈ రోజున రాష్ట్రవ్యాప్తంగా జరుగుతాయి. భారతదేశపు ఆర్థిక రాజధాని అయిన ముంబైలో ఈ రోజున కార్మిక దినోత్సవం కూడా జరుపుకుంటారు. ఇది ప్రభుత్వ సెలవు దినం కూడా.

Published by HT Digital Content Services with permission from HT Tel...