భారతదేశం, జూన్ 23 -- జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన ప్రయివేటు సర్వేయర్ తేజేశ్వర్ (32) హత్యకు గురయ్యాడు. ఈ హత్యలో ఆయన భార్య, భార్య ప్రియుడికి భాగస్వామ్యం ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

పోలీసుల విచారణలో తేలిన వివరాల ప్రకారం.. తేజేశ్వర్‌కు ఏపీలోని కర్నూలుకు చెందిన ఐశ్వర్యతో ఈ ఏడాది ఫిబ్రవరి 13న పెళ్లి నిశ్చయమైంది. అయితే, పెళ్లికి ఐదు రోజుల ముందే ఐశ్వర్య కనిపించకుండా పోయింది.

కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకు ఉద్యోగితో ఆమెకు సంబంధం ఉందని, అతని దగ్గరికే వెళ్లిపోయిందని అంతా అనుకున్నారు. కానీ, ఫిబ్రవరి 16న ఇంటికి తిరిగి వచ్చిన ఐశ్వర్య తేజేశ్వర్‌తో ఫోన్‌లో మాట్లాడింది. తాను ఎవరితోనూ ప్రేమలో లేనని, కట్నం ఇవ్వడానికి తన తల్లి పడుతున్న కష్టాన్ని చూసి తట్టుకోలేక స్నేహితురాలి ఇంటికి వెళ్లిపోయానని చెప్పింది. "నువ్వంటే నాకు చాలా ఇష్టం" అంటూ ఏడ్చింది....