Telangana, జూన్ 9 -- రాష్ట్రంలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల ఎంట్రెన్స్ పరీక్షకు ఉన్నత విద్యా మండలి కసరత్తు చేస్తోంది. ఎంఏ, ఎంకాం, ఎంఎస్‌సీ తదితర పీజీ కోర్సుల్లో ప్రవేశానికి సీపీగెట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే కీలకమైన ఎంట్రెన్స్ పరీక్షల నోటిఫికేషన్లు రాగా... పరీక్షలు కూడా పూర్తవుతున్నాయి. అయితే సీపీగెట్ నోటిఫికేషన్ మాత్రం ఇంకా రాలేదు. కొన్ని కారణాలతో ప్రక్రియ ఆలస్యమైనట్లు తెలుస్తోంది.

గతేడాదిలో మే 16వ తేదీన సీపీగెట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈసారి జూన్ మాసం వచ్చినా ఇంకా రాలేదు. అయితే ఈ వారం రోజుల్లోనే నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది కూడా ఉస్మానియా యూనివర్శిటీనే ప్రవేశ బాధ్యతలు చూడనుంది.

రాష్ట్రంలోని ఉస్మానియా, తెలంగాణ, కాకతీయ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, మహిళా యూనివర్సిటీలు, జేఎన్...