భారతదేశం, ఫిబ్రవరి 21 -- రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గిపోయింది. మరోవైపు ఎండలు పెరుగుతున్నాయి. కొద్దిరోజులుగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇదిలా ఉండగా తెలంగాణ వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. మరికొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడొచ్చని పేర్కొంది. ఈ మేరకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం.. ఈనెల 22వ తేదీన రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ఇక ఈనెల 23వ తేదీన రాష్ట్రంలోని పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్...