భారతదేశం, ఫిబ్రవరి 2 -- భారతీయ రైల్వే ఇటీవల పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా మెుత్తం 22,195 గ్రూప్‌ డి ఖాళీలకు రిక్రూట్‌మెంట్ చేస్తోంది. అయితే దక్షిణ మధ్య రైల్వే(సికింద్రాబాద్) జోన్‌లోనూ పోస్టులు ఉన్నాయి. గ్రూప్ డీ(లెవెల్ 1)కు సంబంధించి 1012 ఖాళీలను భర్తీ చేస్తోంది భారతీయ రైల్వే. పదో తరగతి/ఐటీఐ అర్హత ఉన్నవారి కోసం ఈ మేరకు ఆర్ఆర్‌బీ రిక్రూట్‌మెంట్ చేస్తోంది.

గ్రూప్ డీ(లెవల్ 1) పోస్టులకు సంబంధించి పాయింట్స్‌మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ తదితర ఖాళీలు పలు విభాగాల్లో ఉన్నాయి. పదో తరగతి, ఐటీఐ అర్హతతో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవవచ్చు. ఇప్పటికే ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ జనవరి 31న మెుదలైంది. మార్చి2వ తేదీతో ముగియనుంది.

వయోపరిమితి విషయానికి వస్త...