భారతదేశం, ఫిబ్రవరి 23 -- ఆంధ్రప్రదేశ్ గ్రామ-వార్డు సచివాలయ వ్యవస్థపై పీపుల్స్ పల్స్ పరిశోధనా సంస్థ క్షేత్రస్థాయి సర్వే చేసింది. ఈ మేరకు కొన్ని విషయాలను పంచుకుంది. 2025 డిసెంబర్ 1 నుండి 2026 జనవరి 20 మధ్య నిర్వహించిన ఈ అధ్యయనం ఉత్తరాన ఇచ్ఛాపురం నుండి దక్షిణాన తడ వరకు తీర ప్రాంత గ్రామాలు, రాయలసీమ జిల్లాలు, మారుమూల గిరిజన తండాలతో సహా రాష్ట్రవ్యాప్తంగా జరిగింది.

పరిశోధనా బృందం సచివాలయ సిబ్బంది, లైన్ డిపార్ట్‌మెంట్ అధికారులు, ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు, మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, లబ్ధిదారులు, సామాన్య పౌరులతో సహా 1,200 మందికి పైగా భాగస్వాములతో ముఖాముఖి నిర్వహించింది. ప్రాథమిక సమాచారం, రికార్డుల పరిశీలన, లోతైన ఇంటర్వ్యూల ఆధారంగా నివేదిక పిపుల్స్ పల్స్ నివేదిక తయారుచేసింది. 2019లో గొప్ప ఆశలతో ప్రారంభమైన గ్రామ సచివాలయాలపై నిష్పాక్షికమై...