భారతదేశం, ఫిబ్రవరి 24 -- తిరుపతి, చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చేపట్టిన ఐదో విడత పక్షిజాతుల గణన ముగిసింది. గరుడ అట్లాస్‌ పేరుతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఐసర్‌, తిరుపతి నేచర్‌ సొసైటీ, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ సంయుక్తంగా నిర్వహించాయి. 2022లో ఈ కార్యక్రమం మెుదలైంది. తిరుపతి పరిసరాల్లో 274 పక్షి జాతులను గుర్తించారు.

సర్వే సమయంలో స్వచ్ఛంద సేవకులు, పరిశోధకులు 55,000 కంటే ఎక్కువ పక్షులను వీక్షించారు. 274 జాతులను నమోదు చేశారు.

దివ్యరామం వద్ద ఇటీవల జరిగిన బర్డ్ వాక్ సమయంలో పాల్గొన్నవారు ఈ ప్రాంతంలో మొదటిసారిగా 'ఇండియన్ ఎల్లో టిట్'ను గుర్తించారు. దానిని గుర్తించిన సమీప ప్రదేశం నల్లమల, ఎంఎం హిల్స్ ఉత్తర ప్రాంతాలలో ఉంది.

కొండలపై నివసించే చిన్న, పవర్‌ఫుల్ రాప్టర్ షాహీన్ ఫాల్కన్ కూడా తిరుమల ఘాట్ రోడ్డు వద్ద కనిపించింది. ఇక్కడ వాస్తవానికి అటువంటి జాతు...