భారతదేశం, ఫిబ్రవరి 23 -- ఒకప్పుడు అన్నలొస్తున్నారు.. అంటే ఊర్లలో తెలియని భావోద్వేగం జనాల్లో ఉండేది. ఆ తర్వాత పరిస్థితులు మారుతూ.. మారుతూ.. వచ్చాయి. మావోయిస్టు పార్టీ అంతమయ్యే దశలోకి వచ్చేసింది. నిజానికి కొన్ని సంవత్సరాలుగా ప్రజా సమస్యలపైకంటే.. మిలటరీపైనే మావోయిస్టు పార్టీ ఎక్కువగా ఫోకస్ చేసిందనే విమర్శ ఉంది. అయితే ఆత్మరక్షణలో భాగంగా మిలటరీపైనే దృష్టి ఎక్కువగా పెట్టాల్సి వచ్చిందనేది కొందరి వాదన. ఏది ఏమైన్నప్పటికీ 60 ఏళ్ల నక్సలైట్ ఉద్యమం చివరి దశలో ఉంది.

టాప్ కేడర్ చనిపోవడం, తాజాగా లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ మనుగడపై ఆ భావజాలం ఉన్నవారికి ఆశలు పోయాయి. అయితే తాజాగా లొంగిపోయిన అగ్రనేతలు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి తెలంగాణకు చెందినవారు. దేవ్‌జీ గురించి చాలా మందికి తెలుసు. అయితే మల్లా రాజిరెడ్డి గురించి పూర్తి వివరాలు ...