భారతదేశం, ఫిబ్రవరి 3 -- తిరుమల ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశంపై కొంతకాలంగా దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. ఇప్పటికే సిట్ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. కల్తీ జరిగిన మాట వాస్తవమేనని తెలిపింది. అయితే జంతు కొవ్వుల వాడకం అంశాన్ని మాత్రం పేర్కొనలేదు. మరోవైపు ఈ అంశాన్ని అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక చర్చ జరపాలని జనసేన విజ్ఞప్తి చేసింది.

ఇలాంటి సమయంలో కేబినెట్ సమవేశం కీలక నిర్ణయ తీసుకుంది. తిరుమల లడ్డూ కల్తీ అంశంలో అసలు సూత్రదారులను తేల్చేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. మంత్రివర్గ సమావేశంలో సిట్ నివేదికపైనా చర్చ నడిచింది. నివేదికలోని పాత్రధారులపైన చర్యలు సిట్ సిఫార్సు చేసిందని అభిప్రాయం వ్యక్తం చేసింది. విచారణలో పలు అంశాల్లో తేడాలు ఉన్నట్టుగా కేబినెట్ గుర్తించింది. సిట్ విచారణ, ఛార్జ్‌షీట్, ప్రభుత్వానికి సమర్పించిన విషయా...