భారతదేశం, ఫిబ్రవరి 1 -- కేంద్ర బడ్జెట్‌లో టూరిజానికి ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని అరకులోయపై ప్రత్యేక దృష్టిపెట్టారు. అరకులోయ ట్రెక్కింగ్, ఎకో టూరిజం, నైపుణ్యాభివృద్ధి కార్యకలాపాలకు కేంద్రంగా మార్చనుంది ప్రభుత్వం. అంతేకాదు పులికాట్‌లో పక్షులను చూసేందుకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు కానున్నాయి.

ప్రపంచ స్థాయి ట్రెక్కింగ్ అనుభవాన్ని అందించే సామర్థ్యం, అవకాశం భారతదేశానికి ఉందని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సందర్భంగా పేర్కొంది. పర్యావరణపరంగా స్థిరమైన అభివృద్ధి చేస్తామని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్‌లలో పర్వత మార్గాలు, తూర్పు కనుమలలో అరకు లోయ, పశ్చిమ కనుమలలో పోధిగై మలై(తమిళనాడు), ఒడిశా, కర్ణాటక, కేరళలో కీలకమైన తాబేలు ట్రైల్స్, బర్డ్ వాచింగ్ ట్రైల్స్, 15 పురావస్తు ప్...