భారతదేశం, ఏప్రిల్ 28 -- భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో కొత్త చరిత్రను సృష్టించింది కియా ఇండియా. తన 1.5 మిలియన్ల మేక్ ఇన్ ఇండియా వాహనాలను అనంతపురంలోని తయారీ ప్లాంట్ నుండి ఉత్పత్తి చేసింది. ఈ విజయం కేవలం గణాంకాలు మాత్రమే కాదని, భారతీయ వినియోగదారులలో కియాకు పెరుగుతున్న ప్రజాదరణ, నమ్మకానికి నిదర్శనమని కంపెనీ పేర్కొంది.

ఈ ప్రత్యేక సందర్భంలో కంపెనీ విలాసవంతమైన ఎమ్‌పీవీ కియా కారెన్స్ మీద కూడా అప్డేట్ వచ్చింది. మే 8వ తేదీన కియా ఇండియా కొత్త కారెన్స్ కారును అధికారికంగా ఆవిష్కరించనున్నట్లు ప్రకటించింది. కొత్త కారెన్స్ ప్రస్తుత మోడల్ కంటే సురక్షితమైనది, ఫీచర్-రిచ్‌గా ఉండబోతోంది.

కియా ఇండియా సీఈఓ గ్వాంగ్గు లీ మాట్లాడుతూ.. '1.5 మిలియన్ల మేకిన్ ఇండియా వాహనాలను ఉత్పత్తి చేయడం మాకు గర్వకారణం, భావోద్వేగ క్షణం. మొదటి సెల్టోస్ నుండి నేటి కారెన్స్ వరకు ప్రతి వ...