భారతదేశం, మే 23 -- ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై జూన్‌ 4తో ఏడాది పూర్తవుతుంది. ఈ క్రమంలో ఆలిండియా సర్వీస్ అధికారుల పనితీరుపై శాఖల వారీగా ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి ఆశించిన స్థాయిలో సీఎంఓలో కొందరు పనితీరు లేదనే వాదనలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో శాఖల వారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలతో పాటు సీఎంఓ ప్రక్షాళన కూడా జరుగుతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం సీఎంఓలో ఉన్న ఒకరిద్దరు అధికారులకు తప్ప మిగిలిన వారికి స్థాన చలనం తప్పదని సచివాలయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఏపీ సీఎం పేషీలో ఇద్దరు అధికారుల హవా నడుస్తోంది. వారిలో ఒకరు వైసీపీ ప్రభుత్వ హయంలో ఢిల్లీలో పనిచేశారు. మరొకరు వైసీపీ బాధిత అధికారిగా ప్రచారం పొందారు.

ఈ క్రమంలో ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రితో కలిసి చదువు...