భారతదేశం, నవంబర్ 20 -- ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగా. ఈ గడువు దగ్గర పడింది. ఈనెల 23వ తేదీతో అప్లికేషన్ల ప్రాసెస్ ముగియనుంది. కాబట్టి అర్హులైన అభ్యర్థులు వెంటనే అప్లయ్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చివరి వరకు వేచి చూడకుండా.. ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారు.

అర్హులైన అభ్యర్థులు https://tet2dsc.apcfss.in/ వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ చేసుకోవాలి. నవంబర్ 23వ తేదీ వరకే ఆన్ లైన్ అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఇక అభ్యర్థుల కోసం మాక్ టెస్ట్ ఆప్షన్ నవంబర్ 25, 2025న అందుబాటులోకి వస్తుంది. హాల్ టిక్కెట్లు డిసెంబర్ 3, 2025 నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.

ఏపీ టెట్ పరీక్షలు డిసెంబర్ 10, 2025వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ప్రతి రోజూ 2 సెషన్లలో జరుగుతాయి. మొదటి సెషన్ ఉదయం 9.3...