భారతదేశం, ఫిబ్రవరి 20 -- ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2024 పోలింగ్ శాతం అంశం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో ట్రెండింగ్‌లో ఉంది. రాజకీయ విశ్లేషకులు సైతం అప్పటి పోలింగ్ శాతాన్ని పరిశీలన చేస్తున్నారు. ఎన్నికల సంఘం ప్రకటించిన పోలింగ్ శాతాన్ని, సమయాన్ని పోల్చి డిబెట్లు చేస్తున్నారు. దీనంతటికీ కారణం ది వైర్‌ వెబ్‌సైట్‌లో ఆర్థికవేత్త పరకాల ప్రభాకర్ రాసిన విశ్లేషణ. ఆయన ఏమంటున్నారంటే.. పోలింగ్ శాతాం నమోదు, అధికారిక ప్రకటనల్లో తేడాలు ఉన్నాయని ప్రశ్నలు లేవనెత్తారు. ఆయన రాసిన కథనానికి తోడు.. ప్రొఫేసర్ నాగేశ్వరరావులాంటి రాజకీయ విశ్లేషకులు కూడా ఈ వ్యత్యాసాలపై ఎన్నికల సంఘం బదులు ఇవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మెుత్తం 81 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 175 స్థానాల్లో 164 గెలుచుకు...