Andhrapradesh,telangana, మే 3 -- తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణం నెలకొంది. ఓవైపు ఎండల తీవ్రత ఉండగా.. మరోవైపు వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇవాళ కూడా పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ద్రోణి ప్రభావంతో. ఈ వర్షాలు కురుస్తున్నట్లు ఐఎండీ తెలిపింది.

ఏపీలో ఇవాళ (మే 03) కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసేందుకు అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి,వైఎస్సార్, అన్నమయ్య,తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర...